MLC Nominations |శాసనమండలికి ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులు ఈరోజు నామినేషన్లు వేశారు. కేసీఆర్ సూచనల మేరకు ఈ ఉదయం 11 గంటలకు నామినేషన్లు సమర్పించారు. నామినేషన్లు వేయడానికి ముందు అమరవీరుల స్థూపం వద్ద ఎమ్మెల్సీ అభ్యర్థులు నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డి, దేశపతి శ్రీనివాస్లు నివాళులు అర్పించి అనంతరం నామినేషన్ వేశారు. అభ్యర్థుల నామినేషన్లుకు మంత్రులు హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. కాగా, ఇప్పటికే దేశపతి శ్రీనివాస్, కె.నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డిని బీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించింది.
శాసనమండలిలో ఈ ఏడాదితో గాంగాధర్ గౌడ్, నవీన్ కుమార్, ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీ కాలం ముగియనుంది. దీంతో వీరి కోటాలో ఎన్నికకు ఫిబ్రవరి 27 ఈరోజు నుంచి మార్చి 13 వరకు ఈ ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నామినేషన్లను 14న పరిశీలించనున్నారు. నామినేషన్లు ఉపసంహరణకు ఈ నెల 16వ తేదీ వరకు సమయం ఇచ్చారు. ఆ తర్వాత వారం రోజులలో మార్చి 23 న ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ నిర్వహిస్తారు. ఆరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ చేపట్టి అదే రోజు ఓట్ల లెక్కించనున్నారు.
Read Also: Naveen Murder Case |విస్తుపోయే వాస్తవాలు వెల్లడించిన నిహారిక
Follow us on: Youtube Instagram