స్వతంత్ర, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి రోజా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన ఆమెను చెన్నైలోని థౌజెండ్ లైట్స్లో ఉన్న అపోలో అసుపత్రిలో చేర్పించారు. విపరీతమైన కాలు నొప్పితో పాటు వాపుతో ఆమె బాధపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం రోజా ఆరోగ్య పరిప్థితి నిలకడగా ఉందని మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారని వైద్యులు వెల్లడించారు. రోజా అస్వస్థతకు గురయ్యారన్న వార్తతో వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు లోనయ్యారు. ఆమె త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.