లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న కవితతో కేటీఆర్ ములాఖత్ అయ్యారు. కవిత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు జ్యుడీషియల్ రిమాండ్ను రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి రెండు వారాల పాటు పొడిగించింది. సీబీఐ నమోదు చేసిన కేసులో ఈ నెల 21 వరకు ఆమెకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు చదువుకోవడానికి తొమ్మిది పుస్తకాలు కావాలని కోర్టుని కోరగా.. అందుకు న్యాయస్థానం అనుమతించింది. తదుపరి విచారణ ఈ నెల 21న జరగనుంది. ఆమెను కలిసిన తర్వాత కేటీఆర్ హైదరాబాద్కు తిరుగు పయనం అయ్యారు.
తీహార్ జైలులో కవితతో కేటీఆర్ ములాఖత్
0
310
Previous article
Latest Articles
కమర్షియల్ సిలిండర్లపై మరోసారి బాదుడు
దేశంలో మరోసారి కమర్షియల్ సిలిండర్లపై భారీగా ధరలు పెరిగాయి. దీంతో వ్యాపార వర్గాలపై గ్యాస్ భారం మరింత పెరిగింది. ఇవాళ్టి నుండి దేశవ్యాప్తంగా 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను చమురు...
- Advertisement -
- Advertisement -


