స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరోసారి బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారు. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను దీటుగా ఎదుర్కొనే సత్తా ఒక్క బీజేపీకే ఉందని వ్యాఖ్యానించారు. బిజెపి అంటే సెక్యులర్ పార్టీ అని అన్నారు.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లిని కూడా బిజెపిలో చేరాలని ఆకాంక్షించారు. తాను బిజెపిని వీడి ఎక్కడికి వెళ్లడం లేదని.. బిజెపి పై ప్రజలకు నమ్మకం ఉందన్నారు. ఇతర పార్టీలలోనే కన్ఫ్యూజన్ ఉంది కానీ బీజేపీలో లేదన్నారు. కాంగ్రెస్ పార్టీయే మోస్ట్ కన్ఫ్యూజ్డ్ పార్టీ అని వ్యాఖ్యానించిన కొండా.. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎప్పుడు అరెస్ట్ అనేది మా చేతిలో లేదన్నారు. ఎప్పుడూ ఒక రాజకీయ పార్టీ ఎవరిని అరెస్టు చేయలేదని అన్నారు.
రేవంత్ రెడ్డిని బీజేపీ పార్టీలోకి ఆహ్వానించిన కొండా!
0
307
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


