ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా కేసీఆర్ మంత్రాంగం ఫలించడంలేదా.? అధినేతను కలిసిన తర్వాత ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి సిద్దం అవుతున్నారా.?రోజురోజుకు అసెంబ్లీలో బిఆర్ఎస్ బలం తగ్గుతోం దా.? మిగతా ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్నారా.? త్వరలో బిఆర్ఎస్ఎల్పీని సీఎల్పీలో విలీనం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోందా..? ఇంతకు గులాబీ పార్టీలో ఏం జరుగుతోంది.?
తమ ఎమ్మెల్యేలకు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ బుజ్జగింపులు పని చేయనట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఫామ్ హౌస్ కు పిలిచి కేసీఆర్ స్వయంగా మంత్రాంగం చేస్తున్నప్పటికీ లాభం లేకుండా పోయింది. కేసీఆర్ ను కలిసిన తర్వాత ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం గులాబీ పార్టీకి సవాల్ గా మారింది. ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.తాజాగా చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య ఢిల్లీలో కాంగ్రెస్ గూటికి చేరారు. త్వరలోనే మరి కొంతమంది ఎమ్మెల్యే లు బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటు న్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతకు ముందే బిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి,దానం నాగేందర్,తెల్లం వెంకట్రావు పోచారం శ్రీనివాస్ రెడ్డి,సంజయ్ కుమార్ తాజాగా కాలే యాదయ్య చేరికతో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకి చేరుకుంది.
ఇక పార్టీ మారిన ఎమ్మెల్యే కాలే యాదయ్య ఢిల్లీలో రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువాను కప్పుకు న్నా రు.ఇంతకు మూడు రోజుల క్రితమే కాలే యాదయ్య ఫామ్ హౌస్ లో బిఆర్ఎస్ అధినేతను ఫామ్ హౌస్ లో కలిశారు.పార్టీ వీడవద్దని కేసీఆర్ యాదయ్యకు చెప్పారని టాక్ వినిపిస్తోంది.తాను పార్టీ మారన ని కాలే యాదయ్య కేసీఆర్ కు భరోసా ఇచ్చారని బిఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాలే యాదయ్య 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి చేవెళ్ళ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత బిఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ తరపున చేవెళ్ల నుంచి పోటీ చేసి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యారు. తాజాగా తిరిగి కాలే యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ 39 అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది.ఆ తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయంసాధిం చారు.దీంతో బిఆర్ఎస్ బలం 38కి తగ్గింది.తాజాగా ఆరుగురు ఎమ్మెల్యే లు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అసెంబ్లీలో బిఆర్ఎస్ బలం 32 స్థానాలకు తగ్గింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కంటే ముందే బిఆర్ఎస్ఎల్పీని సీఎల్పీలో విలీనం చేసేదిశగా అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది.ఎల్పీ విలీనంతో బిఆర్ఎస్ పార్టీని దెబ్బకొట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది.బిఆర్ఎస్ ఎమ్మెల్యే లు పార్టీ మారకుండా స్వయంగా అధినేత కేసీఆర్ రంగంలోకి దిగి బుజ్జగిస్తు న్నా ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు మొగ్గు చూపుతున్నారు.దీంతో పార్టీని ఏ విధంగా కాపాడుకోవాలి అనే దానిపై గులాబీ బాస్ కేసీఆర్ మల్లగుల్లాలు పడుతున్నారు. ఇక రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీలో ఎలాంటి పరిణా మాలు జరుగుతాయో చూడాలి.