ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో వైసీపీ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి స్థానంలో వైసీపీ అభ్యర్థిగా మొదట కటారి అరవిందా యాదవ్ను సీఎం జగన్ నియమించారు. తరువాత ఆమె రాజకీయం పట్ల, కందుకూరు నియోజకవర్గం పట్ల ఆసక్తి చూపకపోవడంతో ఆ స్థానంలో బుర్ర మధుసూదన్ పేరు ప్రకటించింది. దీంతో మహీధర్ రెడ్డి తీసుకునే నిర్ణయంపై టీడీపీ, వైసీపీ నేతలతో నియోజవకర్గ ప్రజలకు ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు. మహీధర్ రెడ్డి వైసీపీలో ఉంటారా ? లేక టీడీపీలో చేరుతారా అన్నది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే పార్టీ మార్పు విషయంలో కందుకూరు YCP MLA మానుగుంట మహిధర్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చారని ప్రచారం జరుగుతోంది. పలు దఫాలుగా అభిమానులతో పార్టీ మార్పుపై చర్చించినట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి టీడీపీకి చేరిన కీలక నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఇప్పటికే మానుగుంట మహిధర్ రెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించినట్లు ప్రచారం జరుగుతోంది.
రోజుకో మలుపు తిరుగుతున్న కందుకూరు రాజకీయం
0
206
Previous article
Next article
Latest Articles
చంద్రబాబు తన మంత్రివర్గాన్ని త్వరలో ప్రక్షాళన చేయబోతున్నారా?
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో త్వరలోనే భారీ ప్రక్షాళన జరగబోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు, కొత్త వారికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు తన వ్యూహాన్ని పూర్తిగా మార్చుకున్నారు....
- Advertisement -
- Advertisement -


