స్వతంత్ర వెబ్ డెస్క్: ఆదిపురుష్ సినిమా తరువాత ప్రభాస్ అభిమానులందరి దృష్టి సలార్ సినిమాపై ఉంది. సలార్తో పాటు వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ‘ప్రాజెక్టు K’ చిత్రంలోనూ ప్రభాస్ నటిస్తున్నాడు. దీనిలో కథానాయికగా దీపిక పడుకొణె నటిస్తుండగా.. ముఖ్యమైన పాత్రలలో అమితాబ్, అనుపమ్ ఖేర్, దీపిక పటానీ కనిపించనున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియానే కాదు.. పాన్ వరల్డ్ మూవీగా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తుంది. అయితే సినిమాలో విల్లన్ పాత్రపాత్ర కోసం కమల్ ను సంప్రదించడం .. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందని అంటున్నారు. ఈ సినిమా కోసం ఆయన 30 రోజులు కేటాయించారట. ఇందుకోసం ఆయన 100 కోట్ల పారితోషికాన్ని అందుకోనున్నట్టు చెబుతున్నారు. విలన్ గా కమల్ విశ్వరూప విన్యాసం ఎలా ఉంటుందో చూడాలి మరి!
‘ప్రాజెక్టు K’ లో విల్లన్ పాత్రకి పారితోషకం వంద కోట్లు
Latest Articles
- Advertisement -