ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీ షియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. కవిత జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగియ డంతో ఆమెను కోర్టు ఎదుట హాజరు పర్చారు. కవిత కస్టడీని మరో 14 రోజులు పొడిగించాలని దర్యాప్తు సంస్థలు కోర్టును కోరాయి. దీంతో జూలై 3 వరకు కస్టడీని పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. లిక్కర్ కేసులో కవితతోపాటు చరణ్ప్రీత్ కేసును జులై 3కు వాయిదా వేసింది. దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్లకు లక్ష పూచికత్తు పై బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో వాదనలు ముగియగా, న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మే నెలాఖరులోనే తీర్పు వస్తుందని ఆశించినప్పటికీ రాలేదు. జూన్ నెలాఖరు వరకు హైకోర్టుకు సెలవులు కావడంతో ఆమె ఈ నెలంతా జైల్లోనే ఉండనున్నారు.
ఎమ్మెల్సీ కవితకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
0
305
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


