స్వతంత్ర వెబ్ డెస్క్: స్టేషన్ ఘన్ పూర్ రాజకీయం రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్ టికెట్ ను తనకు కాకుండా ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి కేసీఆర్ ఇవ్వడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. పార్టీ మారే యోచనలో రాజయ్య ఉన్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ హైకమాండ్ సూచన మేరకు రాజయ్య ఇంటికి ప్రభుత్వ చీఫ్ విప్, హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ వెళ్లారు. అసంతృప్తితో ఉన్న రాజయ్యను బుజ్జగించారు. దీంతో రాజయ్య మెత్తబడినట్టు, పార్టీ మారే ఆలోచనను వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది.