తిరుపతి జిల్లా తిరుమల అటవీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పార్వేటి మండపం ప్రాంతం వద్ద ఉన్న శ్రీగంధం ప్లాంటేషన్లో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో మంటలు భారీ ఎత్తున ఎగసిపడ్డాయి. పొగ ఎక్కువగా ఉండడంతో మంటలను అదుపు చేసేందుకు అగ్ని మాపక సిబ్బంంది తీద్రంగా ఇబ్బంది పడ్డారు. ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల ప్రమాదం జరిగిందని అగ్నిమాపకశాఖ అధికారులు భావిస్తున్నారు.