తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా వేసింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేయాలని కోరుతూ బీఆర్ఎస్ హైకోర్టులో పటిషన్ వేసింది. ఈ అంశంపై స్పీకర్కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని కోర్టుకు తీసుకెళ్లారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో అనర్హత వేటు వేయాలన్న సుప్రీంకోర్టు తీర్పులను స్పీకర్ అమలు చేయడం లేదని ఆరోపించారు. వాదనల అనంతరం కేసు విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది హైకోర్టు.