స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెలంగాణ మంత్రి, సీఎం కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావు ప్రస్తుతం పుత్రోత్సాహం అనుభవిస్తున్నారు. ఆయన తనయుడు అర్చిష్మాన్ అమెరికాలోని కొలరాడో యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ పట్టా అందుకున్నారు. అమెరికాలో జరిగిన ఈ స్నాతకోత్సవం కార్యక్రమానికి హరీశ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అర్చిష్మాన్ గ్రాడ్యుయేషన్ పట్టాతో పాటు గ్లోబల్ ఎంగేజ్ మెంట్ అవార్డు కూడా అందుకున్నాడు. దీంతో హరీశ్ రావు తన కుమారుడిని చూసి ఆనందంతో పొంగిపోయారు. మా అబ్బాయి సాధించిన అద్భుతమైన ఘనత పట్ల తండ్రిగా గర్వించకుండా ఎలా ఉండగలను అంటూ ట్వీట్ చేశారు. ఈ అమోఘమైన మైలురాయిని అందుకున్న సందర్భంగా తనకు అభినందనలు చెబుతానని పేర్కొన్నారు.
తనయుడు ఇంజనీరింగ్ పట్టా అందుకోవడంపై హరీశ్ రావు సంతోషం
0
405
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


