తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల తరఫున బీఆర్ఎస్ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. ప్రతి యేడాది ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు. మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగులు భర్తీ చేస్తామని మరి ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారని నిలదీశారు. గ్రూప్-1,గ్రూప్-2, మెగా డీఎస్సీ ఇప్పటి వరకు ఎందుకు వేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందిం చకపోతే నిరుద్యోగుల తరఫున పోరాడటానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉందన్నారు. అంతకు ముందు హైద రాబాద్లో కేటీఆర్ను గ్రూప్-1, డీఎస్సీ అభ్యర్థులు కలిశారు.


