కేసీఅర్ ఫార్మ్ హౌస్ వద్ద గజ్వేల్ డబల్ బెడ్రూం లబ్దిదారులు ఆందోళన చేపట్టారు. కేసీఅర్ ప్రభుత్వ హయాంలో డబల్ బెడ్రూంపై చేపట్టిన లక్కీ డ్రా తంతుపై ఆగ్రహం వ్యక్తం చేసారు. డ్రా పద్దతి ద్వారా 11 వందల ఇండ్ల ను లబ్ధిదారులకు కేటాయించినట్లు ప్రకటించుకున్న కేసీఅర్ ప్రభుత్వం ఇంటి పట్టాలే కాకుండా ఇంటి జాగాలను అందజేయలేదంటూ మండిపడ్డారు. నాటి బిఆర్ఎస్ నేతల తీరును ఈ సందర్భంగా ప్రస్తావించారు.