హైదరాబాద్లో డబుల్బెడ్ రూం ఇళ్ల పేరుతో ఓ కేటుగాడు అమాయకులను నిండా ముంచాడు. జూబ్లీహిల్స్ నియోజ కవర్గంలోని రహమత్నగర్కు చెందిన గోవింద్ తనకు ఇల్లు లేకపోవడంతో డబుల్ బెడ్ రూం ఇల్లుపై ఆశపడ్డాడు. ఇదే విషయాన్ని ఇందిరానగర్కు చెందిన నర్సింహాకు చెప్పాడు. అయితే, తన పలుకుబడితో డబుల్ బెడ్ రూం ఇళ్లను ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి బుట్టలోవేసుకున్నాడు. డిమాండ్ చేసినట్టుగా 50 వేల రూపాయలు ఇచ్చాడు. గోవిందే కాకుండా మరో ముగ్గురితోనూ 50 వేల చొప్పున కట్టించాడు. కొన్నాళ్లకు మోసపోయామని తెలుసుకున్న గోవింద్ మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరుతో మోసం
0
300
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


