మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డిపై ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షక్షణనిధి విరుచుకుపడ్డారు. ప్రజలకు జగన్ చేసిందేమీ లేదని చెప్పారు. బటన్ నొక్కుడు తప్ప రాష్ట్రానికి జగన్ చేసింది శూన్యం అని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మాజీ ఎమ్మెల్యే విమర్శించారు. జగన్ వల్లే తాను తిరువూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయానన్నారు. పవన్ కళ్యాణ్ దమ్మున్న మొనగాడని రక్షణనిధి ప్రశంసించారు. 2023 డిసెంబర్ నుంచి వైసీపీకి తాను దూరంగా ఉన్నట్లు చెప్పారు. ఐ ప్యాక్, సలహాదారులను నమ్మి జగన్ నట్టేట మునిగారని వ్యాఖ్యానించారు. జనం మధ్య తిరిగిన ఎమ్మెల్యేలను జగన్ ఎప్పుడూ గుర్తించలేదని రక్షణనిధి విమర్శించారు.
జగన్పై విరుచుకుపడిన తిరువూరు మాజీ ఎమ్మెల్యే
0
229
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


