తెలంగాణ పార్లమెంట్ పోరులో బీ టీమ్ మంటలు ఎగిసిపడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మొదలైన బీ టీమ్ డైలాగ్ వార్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొనసాగుతోంది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటే అన్న సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఓటమి భయంతోనే బీజేపీతో బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని ఆరోపిస్తున్నారని అన్నారు. బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నది రేవంత్ రెడ్డి అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో బలహీనమైన అభ్యర్థిని పెట్టి బీజేపీ గెలుపుకు దోహదం చేశాడని ఆరోపించారు. రేవంత్ బీజేపీతో కుమ్మక్కయ్యారని అన్నారు.