నాంపల్లి రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వే స్టేషన్లో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్‌లో ఆగి ఉన్న హైదరాబాద్ – జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులోని B1, B2 బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

సాయంత్రం 7.30 గంటలకు బయలుదేరాల్సిన రైలులో సుమారు 6.20 గంటల ప్రాంతంలో పొగలు రావడాన్ని గమనించిన రైల్వే అధికారులు వెంటనే ఫైర్ సిబ్బందికి, హైడ్రా కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బందితో పాటు హైడ్రా DRF బృందాలు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రమాద సమయంలో బోగీల్లో ప్రయాణికులు లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest Articles

బండి సంజయ్‌కు మంత్రి పదవి సేఫ్‌గా ఉన్నట్లేనా?

కేంద్ర మంత్రివర్గ విస్తరణ, పునర్‌వ్యవస్థీకరణపై ఢిల్లీ రాజకీయాల్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ముగించుకుని వస్తుండటంతో కేబినెట్ ప్రక్షాళనకు ముహూర్తం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రెండు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్