Heavy Rains | తెలంగాణాలో ఓ వైపు ఎండలు మండిపోతుంటే.. మరోవైపు అకాల వర్షాలు అన్నదాతల ఆశలను ఆవిరి చేస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో గురువారం భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం రైతులను నిలువునా ముంచేసింది. రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడడంతో పంటంతా నేలపాలైంది. ఈదురు గాలులకు మామిడి పండ్లు రాలిపోయి నేలమట్టమయ్యాయి. పండ్లు చేతికందే సమయంలో నేలరాలడంతో మామిడి రైతులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు వర్షం కారణంగా ఆరబోసిన ధాన్యం కుప్పలు మొత్తం తడిసిపోయాయి. చేతికచ్చిన పంట అమ్ముదామనుకుంటే.. ధాన్యం తడిసిపోయిందని తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు రైతులు. ప్రభుత్వం ఎలాగైనా తమకు సాయం చేయాలని బాధిత రైతులు కోరుకుంటున్నారు.
అకాల వర్షంతో రైతుకంట కన్నీరు.. ఈదురు గాలులకు రాలిపోయిన మామిడి పండ్లు
0
249
Latest Articles
స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి
విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి, సహయక...
- Advertisement -
- Advertisement -


