స్వతంత్ర వెబ్ డెస్క్: ఈ రోజు చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై నిన్న మధ్యలో ఆపి వాయిదా పడడంతో దానిని కొనసాగించారు. ఉదయం చంద్రబాబు మరియు సిఐడి తరపున లాయర్లు తమ వాదననాలను సుప్రీమ్ కోర్ట్ కు వినిపించారు. ఈ రోజు వాదనలతోనూ ఒక స్పష్టత రాని ధర్మాసనం ముందుగా మధ్యాహ్నానికి వాయిదా వేసి, ఆ తర్వాత శుక్రవారానికి వాయిదాను మార్చింది. దీనితో మళ్ళీ క్వాష్ పిటిషన్ మీద తీర్పుకోసం చంద్రబాబు మూడు రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి. ఇదిలా ఉంటే.. ఈ రోజు చంద్రబాబును కలవడానికి బ్రాహ్మణి , భువనేశ్వరి లు వెళ్లారు..వీరితో పాటుగా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కూడా వెళ్లారు. వీరంతా కలిసి రాష్ట్రంలోని పరిస్థితులు మరియు అరెస్ట్ తదనంతర పరిణామాల గురించి చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడప్పుడే చంద్రబాబు జైలు నుండి బయటకు వచ్చేది కుదిరేలా కనిపించకపోవడంతో టీడీపీ కార్యక్రమాలు మరియు ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలి అన్న పలు విషయాలపై చర్చించారని తెలుస్తోంది.
చంద్రబాబును కలిసిన ఫ్యామిలీ మెంబర్స్…రాష్ట్ర పరిణామాలపై చర్చ..!
0
444
Latest Articles
కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?
నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -
- Advertisement -


