24.2 C
Hyderabad
Tuesday, January 14, 2025
spot_img

యాదగిరిగుట్టలోని పరిశ్రమలో పేలుడు.. ఒకరు మృతి

యాదగిరి గుట్ట మండలంలోని పెద్దకందుకూరులో ఓ పరిశ్రమలో పేలుడు సంభవించింది. ప్రీమియర్‌ ఎక్స్‌క్లూజివ్‌ కంపెనీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా,, ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. 8 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు సంభవించడంతో కార్మికులు పరుగులు తీశారు.

ఈ ఘటనలో కనకయ్య అనే కార్మికుడు మృతి చెందాడు. జనగామ జిల్లా బచ్చన్నపేట ఆయన సొంత గ్రామం. యాదగిరి గుట్ట మండలం రామాజీ పేట గ్రామానికి చెందిన మొగిలిపాక ప్రకాశ్‌ పరిస్థితి విషమంగా ఉంది. దీంతో అతనిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం సికింద్రాబద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

అగ్ని ప్రమాదం జరగ్గానే.. యాజమాన్యం ఎమర్జెన్సీ సైరన్‌తో కార్మికులను అలర్ట్‌ చేసింది. గాయపడిన పలువురు కార్మికులను హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

Latest Articles

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ, సింగపూర్ టూర్

బోర్ కొడితే టూర్ తిరగడం సాధారణంగా సామాన్యులు చేసే పని. అయితే, ప్రజా ప్రతినిధులు, పాలక పెద్దలు ప్రజాశ్రేయస్సు కోసం, అభివృద్ది, సంక్షేమం కోసం, పారిశ్రామికీకరణ కోసం, పెట్టుబడుల కోసం..అటు సెమినార్లు, సదస్సుల్లో,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్