28.2 C
Hyderabad
Thursday, May 14, 2026
spot_img

యాదగిరిగుట్టలోని పరిశ్రమలో పేలుడు.. ఒకరు మృతి

యాదగిరి గుట్ట మండలంలోని పెద్దకందుకూరులో ఓ పరిశ్రమలో పేలుడు సంభవించింది. ప్రీమియర్‌ ఎక్స్‌క్లూజివ్‌ కంపెనీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా,, ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. 8 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు సంభవించడంతో కార్మికులు పరుగులు తీశారు.

ఈ ఘటనలో కనకయ్య అనే కార్మికుడు మృతి చెందాడు. జనగామ జిల్లా బచ్చన్నపేట ఆయన సొంత గ్రామం. యాదగిరి గుట్ట మండలం రామాజీ పేట గ్రామానికి చెందిన మొగిలిపాక ప్రకాశ్‌ పరిస్థితి విషమంగా ఉంది. దీంతో అతనిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం సికింద్రాబద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

అగ్ని ప్రమాదం జరగ్గానే.. యాజమాన్యం ఎమర్జెన్సీ సైరన్‌తో కార్మికులను అలర్ట్‌ చేసింది. గాయపడిన పలువురు కార్మికులను హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

Latest Articles

అక్కినేని అభిమానులకు.. ఇక పండగే..

అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య, అఖిల్.. షూటింగ్లో బిజీగా ఉన్నారు. క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అయితే.. అఖిల్ సినిమా లెనిన్ పై క్లారిటీ వచ్చింది కానీ.. నాగార్జున,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్