ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారానికి ఒక్కరోజే సమయం మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధ్య క్షుడు, సీఎం జగన్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇవాళ మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కాసేపట్లో గుంటూ రు లోక్సభ స్థానం పరిధిలోని మంగళగిరిలో ఉన్న పాత బస్టాండ్ సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొం టారు. మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు లోక్సభ స్థానం పరిధిలోని నగరి నియోజకవర్గం పుత్తూరులో ఉన్న కార్వేటినగరం రోడ్ కాపు వీధి సర్కిల్లో జరిగే సభలో సీఎం పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు కడపలోని శ్రీపొట్టి శ్రీరాములు సర్కిల్లో జరిగే సభలో సీఎం జగన్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం
0
205
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


