ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారానికి ఒక్కరోజే సమయం మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధ్య క్షుడు, సీఎం జగన్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇవాళ మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కాసేపట్లో గుంటూ రు లోక్సభ స్థానం పరిధిలోని మంగళగిరిలో ఉన్న పాత బస్టాండ్ సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొం టారు. మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు లోక్సభ స్థానం పరిధిలోని నగరి నియోజకవర్గం పుత్తూరులో ఉన్న కార్వేటినగరం రోడ్ కాపు వీధి సర్కిల్లో జరిగే సభలో సీఎం పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు కడపలోని శ్రీపొట్టి శ్రీరాములు సర్కిల్లో జరిగే సభలో సీఎం జగన్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.