తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్న గొర్రెల స్కామ్ కేసుపై కేంద్రం ఫోకస్ పెట్టింది. కోట్లలో మనీలాండరింగ్ జరిగింద న్న ఆరోపణలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఇప్పటికే ఏసీబీ దర్యాప్తుతో కీలక విషయాలు బయట కు రావడంతో పలువురు అధికారులు జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు. మరి ఈడీ లాగుతున్న తీగతో డొంక కదులుతుం దా..? అసలు పాత్రధారులు బయటకు వస్తారా..? ఎవరి మెడకు ఉచ్చు బిగియనుంది అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.
గత బీఆర్ఎస్ సర్కార్ పాలనలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గొర్రెల పథకంలో కోట్ల రూపాయలు చేతు లు మారాయని, ఇందులో రాజకీయ నేతల ప్రమేయం ఉందన్న ఆరోపణలతో కేంద్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలోనే పథకానికి సంబంధిం చిన పూర్తి సమాచారం ఇవ్వాలని రాష్ట్ర పశుసంవర్థక శాఖకు ఈడీ జోనల్ ఆఫీస్ నోటీసులు ఇచ్చింది. ఇక ఇప్పటికే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అవినీతి నిరోధకశాఖ.. 700 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్టు తెలిపింది. ఇప్పుడు తాజాగా రంగంలోకి దిగిన ఈడీ మనీలాండరింగ్పై కూపీ లాగుతోంది. ఇతర రాష్ట్రాల్లోనూ లింకులున్నాయన్న ఆరోపణ లపై దృష్టి సారించింది. దర్యాప్తలో భాగంగా జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి చిరునామాలు, ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వాలని కోరింది. గొర్రెల కొనుగోళ్ల కోసం సమాఖ్య నుంచి ఏయే జిల్లాల అధికారుల ఖాతా ల్లో నిధులు జమ చేశారో వారి వివరాలు, ఆయా బ్యాంకు ఖాతాల సమాచారం, లబ్ధిదారుల వాటాగా జమ చేసిన నిధులు, ఏయే ఖాతాల్లో జమ అయ్యాయి..?, గొర్రెల రవాణా ఏజెన్సీల సమాచారం, వాటికి జరిగిన చెల్లింపుల వివరా లు, గొర్రెలకు కొనుగోలు చేసిన దాణా, దాన్ని ఏయే లబ్ధిదారులకు పంపించారు? దీని కోసం ఎవరికి నిధులిచ్చారు. ఇలా పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులను కోరింది. అలాగే ఈ పథకంలో జరిగిన అవినీతిపై అంతర్గత నివేదికలతో కూడిన సమాచారం కూడా వెంటనే ఇవ్వాలని ఆదేశించింది.
కేంద్రం రంగంలోకి దిగడంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు పుడుతుంది. ఇప్పటికే స్కామ్లో ప్రధాని నిందితులైన మొహిదుద్దీన్, ఇక్రముద్దీన్ ఇద్దరు పరారీలో ఉన్నారు. ఇక ఈ విచారణలో కీలక విషయాలు వెలుగుచూశాయి. ఏపీకి చెందిన పల్నాడు రైతుల దగ్గర నుండి గొర్రెలను విక్రయించి.. వారికి డబ్బులు చెల్లించలేదు. వారికి ఇవ్వాల్సిన 2.10 కోట్ల రూపాయలను బినామీ ఖాతాలోకి మళ్లించినట్టు గుర్తించారు. హైదరాబాద్ గచ్చిబౌలి పీఎస్లో కేసునమోదు అయ్యాక మొదలు నలుగురు అధికారులను అరెస్ట్ చేసింది. ఆ తర్వాత మొహిదుద్దీన్, ఈక్రముద్దీన్ పాత్ర కీలకమని గుర్తించిన ఈడీ వారిని fir లో చేర్చింది. అయితే, వీరిద్దరూ అప్పటి నుండి ఇప్పటివరకు విదేశాల్లోనే ఉండటంతో స్వదేశానికి రప్పించే ప్రయత్నంలో ఉన్నారు ఈడీ అధికారులు.
మరోపక్క గొర్రెల పథకం కుంభకోణం నిందితుల విచారణ ముగియడంతో ఏసీబీ అధికారులు మళ్లీ వారిని చంచల్ గూడ జైలుకు తరలించారు. వీరు ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది. అయితే, ఈ కేసులో ఇప్పటివరకు పది మందిని అరెస్టు చేశారు. దర్యాప్తులో భాగంగా అరెస్టయి జైల్లో ఉన్న పశుసంవ ర్ధకశాఖ సీఈవో రామ్చందర్నాయక్, మాజీ ఓఎస్డీ కల్యాణ్కుమార్లను ఏసీబీ అధికారులు న్యాయస్థానం అనుమతితో సోమవారం అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజులపాటు వీరిని విచారించేందుకు కోర్టు పర్మిషన్ ఇవ్వడంతో స్కాం పై ఆరా తీస్తున్నారు. అసలు కుంభకోణానికి ఆద్యులెవరు..? ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది, పదే పదే అవే గొర్రెల ను కొన్నట్లు రికార్డుల్లో ఎలా చూపించారు..? ఆడిటింగ్లో ఈ విషయం ఎందుకు బయటపడలేదు అన్న వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. అందుకు వీరి నుంచి సరైన సమాధానం రాలేదని తెలుస్తోంది. గొర్రెలు అమ్మింది ఒకరైతే వాటి తాలూకు నగదు దళారుల ఖాతాల్లో జమ అయినట్టు విచారణలో వెల్లడైంది. ఇలా ఎలా చేశారు అన్న వివరాలను రాబట్టేందుకు ప్రయత్నించింది ఏసీబీ. కానీ మూడు రోజులపాటు అనేక రకాలుగా ప్రశ్నించినా నిందితులు ఇద్దరి నుంచి సరైన సమాధానం రాలేదని తెలుస్తోంది. ఇక మూడు రోజుల గడువు ముగియడంతో వైద్య పరీక్షల అనంతరం నిందితులను తిరిగి జైలుకు తరలించారు.
ఇదిలా ఉంటే గొర్రెల పథకం స్కామ్పై స్పందించారు మెదక్ ఎంపీ రఘునందన్రావు. బీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చారని తెలిపిన ఆయన, కేసీఆర్, హరీష్ రావు, వెంకటరామిరెడ్డిలు జైలుకు వెళ్లక తప్పదన్నారు. ముందుంది ముసళ్ల పండుగ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిం చారు. ఇలా మొత్తానికి గొర్రెల పథకం స్కామ్ తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే ఏసీబీ దర్యాప్తుతో కీలక విషయాలు వెలుగులోకి రాగా.. కేంద్రం ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ ఎంట్రీతో అధికారులు, రాజకీయ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఏ రూపంలో ఎవరి మెడకు చుట్టుకుంటుందోనన్న గుబులు పట్టుకుంది.