ప్రియాంక గాంధీ నామినేషన్ కార్యక్రమానికి హాజరు కానున్న రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం కేరళ వెళ్లనున్నారు. వయనాడ్ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ నామినేషన్ కార్యక్రానికి ఆయన హాజరుకానున్నారు. ప్రియాంక నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేతో పాటు కర్ణాటక సీఎం సిద్దరామయ్య కూడా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ వయనాడ్‌తోపాటు రాయ్‌ బరేలీ స్థానం నుంచి పోటీ చేసి, రెండుచోట్లా విజయం సాధించారు. అయితే రాయ్‌ బరేలీ నుంచి ఎంపీగా కొనసాగుతూ వయనాడ్‌ స్థానానికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది.

వయనాడ్‌ ఉపఎన్నిక గెలుపు కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది. ప్రియాంక గాంధీ తొలిసారిగా ఎన్నికల బరిలో నిలవడంతో వయనాడ్ సీటును గెలిచేందుకు కాంగ్రెస్ హైకమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. గాంధీ కుటుంబాన్ని రాయ్‌ బరేలి, అమేథీ తర్వాత అక్కున చేర్చుకున్న నియోజకవర్గం వయనాడ్‌. 2019లో కాంగ్రెస్‌ కంచుకోట అమేథీలో రాహుల్‌ గాంధీ ఓటమి పాలవగా, వయనాడ్‌ మాత్రం అఖండ విజయాన్ని అందించింది. 2024 లోకసభ ఎన్నికల్లోనూ అక్కడి ప్రజలు రాహుల్‌ని అక్కున చేర్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే వయనాడ్ సీటును గెలిచేందుకు కాంగ్రెస్ పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది.

Latest Articles

కేంద్రానికి, సీబీఎస్ఈ బోర్డుకు కేటీఆర్ సూటి ప్రశ్నలు

సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ స్పందించారు. మూల్యాంకనంలో అవకతవకలపై అటు కేంద్రాన్ని ఇటు సీబీఎస్‌ఈ బోర్డుని నిలదీశారు. న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులకు ఆయన మద్దతు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్