మెగాస్టార్ చిరంజీవిని కలిసిన అక్కినేని నాగార్జున

మెగాస్టార్ చిరంజీవిని అక్కినేని నాగార్జున కలిశారు. త్వరలో జరగనున్న ANR అవార్డుల కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ ఫొటోలను నాగార్జున తన సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఈ ఏడాది నాకెంతో ప్రత్యేకమైనదని నాగార్జున ట్వీట్ చేశారు. నాన్నగారి శతజయంతి వేడుకలకు చిరంజీవి, అమితాబ్‌ బచ్చన్‌ రానున్నారని తెలిపారు. దీంతో ఈ వేడుక మరింత ప్రత్యేకం కానుందని, ఈ శతజయంతి వేడుకను మరుపురానిదిగా చేద్దాం అని పేర్కొన్నారు.

2024కు గాను ఏఎన్నార్‌ జాతీయ అవార్డును చిరంజీవికి ఇవ్వనున్నట్టు నాగార్జున గతంలోనే ప్రకటించారు. అక్టోబరు 28న ఈ పురస్కారం ప్రదానం చేయనున్నారు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్‌ చేతుల మీదుగా చిరంజీవి అవార్డు అందుకోనున్నారు.

Latest Articles

హెలో స్పేస్‌.. విక్రమ్‌ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్