జీహెచ్ఎంసీ ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు వెల్లువలా వచ్చాయి. ఎన్నికల కోడ్ కారణంగా మూడు నెలలుగా ప్రజావాణి నిర్వహించలేదు. దీంతో అనేకమంది ఫిర్యాదులు తీసుకొని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్తో పాటు పలువురు అధికారులకు తమ సమస్యలను ప్రజలు విన్నవించుకు న్నారు. అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా తమ సమస్య లు పట్టించుకోవడంలేదని వారు వాపోయారు. శేరిలింగంపల్లికి చెందిన గాయత్రి, ఉప్పల్ నుండి వచ్చిన వినోద్ కుమార్ తమ సమస్యలు చెప్పుకున్నారు. ఈ సారైనా అధికారులు పట్టించుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఉప్పల్కి చెందిన మరో వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజావాణిలో వెల్లువలా ప్రజల సమస్యలపై ఫిర్యాదులు
0
331
Latest Articles
సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి
విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -
- Advertisement -


