22.9 C
Hyderabad
Monday, February 10, 2025
spot_img

చంద్రగిరి పోలీస్‌ స్టేషన్‌లో మంచు మనోజ్‌ ఫిర్యాదు

మంచు ఫ్యామిలీ రచ్చ కొనసాగుతోంది. నిన్న తిరుపతిలో మోహన్‌ బాబు యూనివర్సిటీ దగ్గర హైడ్రామా అనంతరం మంచు మనోజ్‌ గురువారం చంద్రగిరి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. నిన్నటి పరిణామాలపై డీఎస్పీకి మనోజ్‌ ఫిర్యాదు చేశారు. తనతో పాటు తన భార్య మౌనికపైనా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఇంట్లోకి తననే ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. అయితే లా అండ్ ఆర్డర్‌ ను దృష్టిలో పెట్టుకుని తిరుపతి వదిలి వెళ్లాలని పోలీసులు ఆయనకు సూచించినట్టు సమాచారం

గత కొన్ని రోజులుగా కుటుంబ కలహాలతో మంచు ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా తన కుటుంబ పెద్దలకు నివాళులర్పించేందుకు బుధవారం సాయంత్రం తిరుపతిలోని మోహన్‌ బాబు యూనివర్సిటీకి మంచు మనోజ్‌ దంపతులు చేరుకున్నారు. వారిని లోపలికి వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. గేటు వద్దే వారిని అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది.

తాను గొడవ చేసేందుకు రాలేదని ఈ సందర్బంగా మంచు మనోజ్‌ అన్నారు. తాతా, నానమ్మ సమాధులకు నివాళులర్పించేందుకు వచ్చానని చెప్పారు. తన ఫ్లెక్సీలను కావాలనే చించేశారని అన్నారు. తన తండ్రి, సోదరుడు తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారమమయ్యే సమస్యలను పెద్దది చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన హక్కులకు భంగం కలిగిస్తే ఎవరిపైనైనా కేసులు పెడతానని హెచ్చరించారు. అందరి కష్టంతోనే విద్యానికేతన్ వర్సిటీగా ఎదిగిందని.. ఇందులో తనకు భాగం ఉందని ఉద్ధాటించారు.

Latest Articles

డైరెక్టర్‌ ఆర్జీవీకి సీఐడీ నోటీసులు

సంచలన డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఇవాళ సీఐడీ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. వ్యక్తిగత కారణాల వల్ల విచారణకు రాలేనని ఆర్జీవీ సీఐడీ అధికారులకు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్