సింగపూర్ పర్యటనలో బిజీ బిజీగా సీఎం రేవంత్

సింగపూర్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడ బిజీబిజీగా గడుపుతున్నారు. మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి సింగపూర్ పర్యావరణ మంత్రి గ్రేస్ ఫూ హై యూన్‌ను కలిశారు. వివిధ రంగాల్లో భాగస్వామ్యంపై చర్చలు జరిపినట్లు రేవంత్ వెల్లడించారు. పట్టణ ప్రణాళిక, మౌలిక సదుపాయాలు, నీటి నిర్వహణ, నైపుణ్యాల అభివృద్ధి, క్రీడలు, సెమీకండక్ర్లు తయారీ, పర్యావరణం, సుస్థిర శాస్త్రాలు, సాంకేతికతతో సహా అనేక రంగాల్లో తెలంగాణ ప్రభుత్వ ఆలోచనలను వివరించామన్నారు. తెలంగాణ లక్ష్యాలను సాకారం చేయడంలో భాగస్వామ్యం అవుతాయని మంత్రి గ్రేస్ తెలిపారు. ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, నీటి నిర్వహణ, తెలంగాణ సుస్థిర ప్రణాళికలపై ఆమె ఆసక్తిని కనబరిచారాన్నారు. కలిసి పనిచేసేందుకు అంగీకరించినట్లు సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా వెల్లడించారు.

Latest Articles

మల్లారెడ్డిపై వేటు తప్పదా?

మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యవహారం వివాదాస్పదంగా మారుతోందా...? మల్లారెడ్డి వైఖరిపై బిఆర్ఎస్ క్యాడర్ ఆగ్రహంతో ఉందా.? మల్లారెడ్డిపై వేటు వేయాలని గులాబీ అధిష్టానంపై ఒత్తిడి పెరుగుతోందా...? ఇంతకు మల్లారెడ్డి ఆగ్రహానికి గురి కావడానికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్