30.1 C
Hyderabad
Friday, July 11, 2025
spot_img

వరదలపై సీఎం చంద్రబాబు సమీక్ష

ఏపీలో వరదలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 9వ రోజు చేపట్టిన సహాయక చర్యలపై కలెక్టర్లు, ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. భారీ వర్షాలు ఉన్న ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో పరిస్థితులపై ఆరా తీశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కాకినాడ, ఏలూరు, తూర్పుగోదావరి కలెక్టర్లతో మాట్లాడారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలపై మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. బుడమేరు వరద నీటి ప్రభావం కొంత మేరకు తగ్గిందని.. సాయంత్రానికి దాదాపు అన్ని ప్రాంతాలు వరద నుంచి బయటపడతాయని చెప్పారు. వాహనాలు, సిబ్బంది వెళ్లలేని ప్రాంతాల్లో డ్రోన్లు ఉపయోగించాలని సూచించారు. విజయవాడలో కొన్ని ఇళ్లు మినహా విద్యుత్ పునరుద్ధరణ పూర్తయిందని అధికారులు ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా తెలిపారు. అంటు వ్యాధులు ప్రబలకుండా పూర్తిస్థాయిలో పారిశుధ్య చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. మెడికల్ క్యాంపులు కొనసాగించాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మిగిలిన 5 టవర్ల పరిధిలో కూడా సిగ్నల్స్ పునరుద్ధరణ త్వరగా చేపట్టాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్