26.8 C
Hyderabad
Wednesday, July 16, 2025
spot_img

టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ

కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఉద్రిక్తత నెలకొంది. టిడిపిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. జడ్పి స్కూల్‌లో మధ్యాహ్నం భోజనం ఏజెన్సీ విషయంలో టీడీపీ వర్గాల మధ్య ఘర్షణకు దిగారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి వర్గీయులపై, రాఘవేంద్ర రెడ్డి వర్గం దాడి చేసింది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మంత్రాలయం నియోజకవర్గంలో తిక్కారెడ్డి వర్గం, రాఘవేంద్ర రెడ్డి వర్గాల మధ్య విబేధాలు రోడ్డెక్కాయి. మంత్రాలయం టీడీపీ ఇంచార్జి తానేనని మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, స్టోర్ డీలర్లు తమకే కావాలని రాఘవేంద్ర రెడ్డి వర్గం పట్టు బడుతోంది. ఇప్పుడు ఏకంగా బాహాబాహికి దిగాయి. పది రోజుల క్రితం వంట ఏజెన్సీ కోసం ప్రాథమిక పాఠశాలలో ఒక్కరిపై ఒక్కరు దాడి చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పింఛన్ల పంపిణీ పండుగ రోజు ఇలా జరగడం ఏమిటని పలువురు చర్చించుకుంటున్నారు. విద్యార్థులు ముందే ఘర్షణకు దిగడంతో విద్యార్థులు సైతం భయాందోళనకు గురయ్యారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్