తెలంగాణలో కౌంటింగ్ కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గొల్లపల్లిలోని బండారి శ్రీనివాస్ కాలేజీలో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా అధికారులు పరిశీలించారు. సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిం చారు. కౌంటింగ్ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. చేవెళ్ల పార్లమెంట్ లోని ఏడు నియోజకవర్గాలు చేవెళ్ల, శేర్లింగంపల్లి తాండూరు, వికారాబాద్, పరిగి, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజవకర్గాల ఓట్ల లెక్కింపు ఉంటుందని అధికారులు తెలిపారు. సీసీటీవీ పర్యవేక్షణలో ఓట్లు లెక్కింపు కొనసాగుతుందని కట్టుదిట్టమైన భద్రతతో పోలీసుల బందోబస్తు నిర్వహి స్తున్నారని చెప్పారు.
చేవెళ్ల పార్లమెంట్ కౌంటింగ్ సర్వం సిద్ధం
0
474
Previous article
Next article
Latest Articles
మణిరత్నం.. ఈసారైనా.. మ్యాజిక్ చేసేనా..?
భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరు మణిరత్నం. ఇప్పటి వరుకు మణిరత్నం ఎన్నో అద్భుత చిత్రాలు అందించారు.. బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాలు సాధించారు. అయితే.. ఈమధ్య కాలంలో ఈ సంచలన దర్శకుడు నుంచి...
- Advertisement -
- Advertisement -


