25.3 C
Hyderabad
Tuesday, July 1, 2025
spot_img

శ్వేతపత్రంలో వైసీపీ వైఫల్యాల చిట్టా … పరిష్కారాలు ఎక్కడ ?

  ప్రపంచంలోనే అతిపెద్ద భూ సేకరణ ప్రాజెక్టు అమరావతి అని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సచివా లయంలో రాజధాని అమరావతిపై ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగాన్ని చరిత్ర గుర్తు పెట్టుకుంటుందన్నారు.

అమరావతి అనేది ఆ కాలంలో ప్రముఖ నగరం పేరు. రాష్ట్ర విభజన జరుగుతుందని, అమరావతి రాజధాని అవుతుం దని ఎవరూ ఊహించలేదు. రాజధానికి అమరావతి పేరు పెట్టాలని రామోజీగ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు సూచించారు. అమరావతి పేరును క్యాబినెట్‌లో వందశాతం అంగీకరిం చారు. ప్రతి గ్రామం నుంచి మట్టి నీరు తెచ్చి అమరావతిలో ఉంచామన్నారు సీఎం చంద్రబాబు. యమునా నది నీరు, పార్లమెంట్‌ మట్టిని ప్రధాని మోడీ తెచ్చారు. దేశంలోని ప్రముఖ దేవాలయాల పవిత్ర జలం, మట్టి తెచ్చాం. ఆ పవిత్ర జలం, మట్టి మహిమ అమరావతిలో ఉంది. అందుకే అమరావతిని ఎవరూ కదిలించలేకపోయారని తెలిపారు. రాష్ట్రంలో ఎటుచూసినా సమదూరంలో ఉన్న ప్రాంతం ఇది. రాష్ట్ర భవిష్యత్తును ఆకాక్షించే ఎవరైనా అమరావతిని ఒప్పుకోవాల్సిందేనన్నారు. విజయవాడ, గుంటూరు మధ్యే రాజధాని ఉండాలని శివరామకృష్ణ కమిటీ కూడా చెప్పిందన్నారు సీఎం చంద్రబాబు.

29 వేల మంది రైతులు 34,400 ఎకరాల భూమిని రాజధాని కోసం ఇచ్చారన్నారు. రైతులు ఇచ్చిన భూమికి ఏటా పరిహారం ఇచ్చాం. పదేళ్ల వరకు పరిహారం ఇస్తామని రైతులకు చెప్పాం. రైతు కూలీలకు కూడా పరిహారం ఇచ్చాం. రైతులు ఇచ్చింది, ప్రభుత్వ భూమి కలిపి 53,745 ఎకరాలు సమకూరింది. రాజధాని రాష్ట్రానికి నడి మధ్యనే ఉండాలని ఆనాడు ప్రతిపక్షనేతగా జగన్‌ చెప్పారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చాక ఏం చేశారో ప్రజలే చూశారు. దేశంలో ఏ నగరానికి లేని సౌలభ్యత అమరావతికి ఉంది. ఇన్ని కిలోమీటర్ల రివర్‌ ఫ్రంట్‌ ఎక్కడా లేదు. ఒక వైపు గోదావరి, మరో వైపు కృష్ణా రెండు నదుల అనుసంధానంతో ఎప్పుడూ ఫ్రెష్ వాటర్‌ అందుబాటులో ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు.

విభజన సమయంలో ఏపీకి లోటు బడ్జెట్‌ ఉందన్నారు సీఎం చంద్రబాబు. ప్రాజెక్టు ఏదైనా విన్‌ పరిస్థితి లోనే ముందుకు తీసుకెళ్లానన్నారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక మంది ముందు కొచ్చారు. సింగపూర్‌ మాస్టర్‌ప్లాన్‌ ఇచ్చింది. తొమ్మిది విభాగాల్లో అమరావతి హబ్‌గా మారాలని ఆకాంక్షిం చాం. ఫైనాన్షియల్‌, నాలెడ్జ్‌, టూరిజం, ఎలక్ట్రానిక్‌, హెల్త్‌ సిటీ ప్రతిపాదించాం. పచ్చదనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. దేశంలోని ఏ నగరానికీ అమరావతిలా సౌలభ్యం లేదన్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక అమరావతిలో జరుగుతున్న పనులను నిలిపి వేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా వేదికలను కూల్చేశారు. ఏ కట్టడం కట్టాలన్నా పదిసార్లు ఆలోచిస్తాం. అమరాతి రైతులను అనేక రకాలుగా అవమానించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు రోడ్డున పడ్డారు. అమరావతి రైతుల త్యాగాన్ని చరిత్ర గుర్తు పెట్టుకుంటుందన్నారు సీఎం చంద్రబాబు.

అమరావతి విధ్వంసం చేసి తెలుగు జాతికి ద్రోహం చేశారని తెలిపారు సీఎం చంద్రబాబు. రాజధానిని మార్చిన వ్యక్తి గతంలో ఎవరూ లేరన్నారు. క్యాపిటల్‌ మార్పు జరిగితే ఏం జరుగుతుందో దేశానికిది కేస్‌ స్టడీ అని తెలిపారు. ఇంతగా విధ్వంసం చేసిన వ్యక్తి రాజకీయాలకు అర్హుడేనా? అంటూ ప్రశ్నించారు. కేసులు ఎదుర్కొంటున్న అమరావతి రైతులకు న్యాయం చేస్తానని, ఏం జరిగినా వెనక్కి చూడను. ముందుకే వెళ్తానని, న్యాయపరమైన చిక్కులు తొలగించి పనులు శరవేగంగా పూర్తి చేస్తామన్నారు. ఒకసారి నమ్మకం కోల్పోతే పెట్టుబడిదారులు మళ్లీ రారని, ఇప్పుడు పెట్టుబడి దారుల ను రప్పించాలంటే చాలా కష్టపడాలన్నారు. మన రాష్ట్రంలో అవకాశాలు లేవా  ప్రజలకు తెలివితేటలు లేవా? మన రాష్ట్రం రైస్‌ బౌల్‌ అని దేశ వ్యాప్తంగా పేరుందన్నారు సీఎం చంద్రబాబు. మంచి భూములు ఉన్నాయి. పండించే రైతులు ఉన్నారు. అమరావతికి బ్రాండ్‌ ఇమేజ్‌ ఎలా తేవాలనే ఆలోచిస్తున్నాం. ఈ శిథిలాల నుంచే బంగారు భవిష్యత్తు కు నాంది పలుకుతాం. ఇక్కడ సంపద సృష్టి, ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలన జరగాలన్నారు. అమరావతిలో పనులు మళ్లీ ప్రారంభమయ్యాయని, అంచెలంచెలుగా పూర్తి చేస్తామ న్నారు సీఎం చంద్రబాబు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్