ఏపీ సంక్షోభంలో ఉందని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు దెబ్బతి న్నాయని, రైతులు అప్పులపాలయ్యారని చెప్పారు. పదేళ్ల తర్వాత రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు. కక్షపూరిత రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్లాలని కూటమి ఎమ్మెల్యేలకు సూచించారు. మూడు రాజధానులంటూ ఆటలాడే పరిస్థితి ఇక ఏపీలో ఉండ దన్న చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు విశాఖను ఆర్థిక, ఆధునిక రాజధానిగా చేసుకుందామని చంద్రబాబు తేల్చి చెప్పారు.