మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. వివేకా రెండో భార్య షమీమ్ వాంగ్మూలం నేపథ్యంలో సీఆర్పీసీ 160కింద ఆయనకు నోటీసులు ఇచ్చారు. దీంతో శనివారం సాయంత్రం విచారణ కోసం సీబీఐ కార్యాలయానికి వచ్చారు. వివేకా హత్య జరిగిన ఘటనా స్థలంలో దొరికిన లేఖపై రాజశేఖర్ రెడ్డిని అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సీబీఐ విచారణ ముగియడంతో ఆయన తన ఇంటికి వెళ్లిపోయారు. ఈ కేసులో ఇప్పటికే భాస్కర్రెడ్డి, ఉదయ్ కుమార్రెడ్డిలతో పాటు ఎంపీ అవినాశ్ రెడ్డిని విచారిస్తున్న సీబీఐ.. ఇప్పుడు వివేకా అల్లుడిని కూడా విచారణకు పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డిని విచారించిన సీబీఐ
0
291
Previous article
Next article
Latest Articles
పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 2,890 రూపాయలు పెరిగి లక్ష 49 వేల 730 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల...
- Advertisement -
- Advertisement -


