మాజీ సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. జగన్‌ యూకే పర్యటనకు షరతులతో అనుమతిస్తూ హైదరాబాద్‌ సీబీఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్‌ 3 నుంచి 25 వరకు యూకేలోని తమ కుమార్తె పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు జగన్‌కు అనుమతించింది. ఆయన చేసుకున్న దరఖాస్తుపై ఐదేళ్ల కాలపరిమితితో పాస్‌పోర్టు జారీ చేయాలని పాస్‌పోర్టు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దేశం విడిచి వెళ్లేముందు పర్యటన వివరాలను కోర్టుకు, సీబీఐకి అందజేయాలని షరతు విధించింది. మొబైల్‌, ల్యాండ్‌లైన్‌, ఫ్యాక్స్‌, ఈ మెయిల్ వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి డాక్టర్‌ టి. రఘురాం ఉత్తర్వులు జారీ చేశారు.

Latest Articles

అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు

అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు ఈ నెల 26న కేరళను తాకనున్న తొలకరి వానలు అండమాన్‌, నికోబార్‌లో మొదలైన వర్షాలు భారత వాతావరణ శాఖ (India Meteorological Department) దేశ ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పింది. అండమాన్ సముద్రంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్