బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం ఢిల్లీ వేదికగా జరగనుంది. నేడు, రేపు రెండ్రోజుల పాటు విదేశాంగ మంత్రుల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ అధ్యక్షత వహిస్తారు.
బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సులో ప్రపంచ, ప్రాంతీయ సమస్యలు, ముఖ్యంగా పశ్చిమాసియా పరిణామాలపై చర్చించనున్నారు. ఈ సమావేశాలకు హాజరవుతున్న విదేశాంగ మంత్రులు ప్రధాని మోదీని కలవనున్నారు. ఇరాన్-అమెరికా యుద్ధం, ప్రపంచ సవాళ్లపై చర్చలు జరపనున్నారు. గ్లోబల్ గవర్నెన్స్ సంస్కరణలపైనా సమావేశంలో చర్చ జరగనుంది.


