ఎమ్మెల్సీ కవితపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తాను సమర్థించనని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. సంజయ్ వ్యాఖ్యలకు, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని అరవింద్ క్లారిటీ ఇచ్చారు. అది ఆయన వ్యక్తిగతమని.. ఆ వ్యాఖ్యలను ఆయనే సంజాయిషీ ఇచ్చుకుంటారని స్పష్టంచేశారు. సంజయ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిదని.. సామెతలు ఉపయోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాష్ట్ర అధ్యక్ష పదవి అనేది పవర్ సెంటర్ కాదని.. నేతలను సమన్వయం చేసే బాధ్యత మాత్రమేనని పేర్కొన్నారు. అరవింద్ వ్యాఖ్యలలో తెలంగాణ బీజేపీలో లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. సంజయ్, అరవింద్ మధ్య కొద్దికాలంగా విభేధాలు ఉన్నాయని కమలం నేతలు చెబుతున్నారు. మరోవైపు తెలంగాణలో కల్వకుంట్ల కుంటుంబం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. ఈడీ విచారణలో కవిత సహకరించలేదని తమ దగ్గర సమాచారముందని వెల్లడించారు.
కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలను తప్పుపట్టిన బీజేపీ ఎంపీ
0
330
Previous article
Latest Articles
లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషభ్ పంత్
ఐపీఎల్ 2026 సీజన్లో ఘోర వైఫల్యం తర్వాత లక్నో సూపర్ జెయిట్స్ జట్టు కెప్టెన్ నుంచి రిషబ్ పంత్ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియా...
- Advertisement -
- Advertisement -


