బీజేపీ తన మేనిఫెస్టోను విడుదల చేయడానికి సిద్ధమైంది. ఇందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలు స్తోంది. రేపు విడుదల చేయనున్నట్లు పార్టీకి చెందిన విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రధానమంత్రి మోదీ, బీజేపీ జాతీయాధ్య క్షుడు నడ్డా, కేంద్ర మంత్రులు షా, రాజ్నాథ్ సింగ్ తదితరులు ఈ సంకల్ప పత్రాన్ని ఆవిష్కరించనున్నట్లు పేర్కొన్నా యి. అభివృద్ధి, దేశ శ్రేయస్సు, యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన అజెండాగా మేనిఫెస్టో తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.