హైదరాబాద్లో ఒక ఆటో డ్రైవర్ ప్రాణాలను పణంగా పెట్టి రౌడీ షీటర్ను అడ్డుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. బేగంబజార్ జిన్సీ చౌరాహా వద్ద ఉదయం మార్నింగ్ వాక్కు వచ్చిన మంజు ఓమ్లత మెడలోని బంగారు గొలుసును డబీర్పురాకు చెందిన రౌడీ షీటర్ మహ్మద్ సోహేల్ లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో అక్కడ ఉన్న ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్ అప్రమత్తమై తన ఆటోతో నిందితుడిని ఢీకొట్టి కిందపడేసి అడ్డుకున్నాడు. నిందితుడు కర్రతో దాడి చేసినా జాహెర్ వెనక్కి తగ్గకుండా ధైర్యంగా ఎదుర్కొన్నాడు.
జాహెర్ సహాయంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మొత్తం ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. తర్వాత పోలీసులు జాహెర్ను గుర్తించి, హైదరాబాద్ సీపీ సీవీ సజ్జనార్ అతడిని అభినందించారు. ఆయనకు నగదు బహుమతి , ప్రశంసాపత్రం అందజేశారు.
నిందితుడు మహ్మద్ సోహేల్పై ఇప్పటికే 16 కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ఆటో డ్రైవర్ జాహెర్ ధైర్యాన్ని నగర ప్రజలు ప్రశంసిస్తున్నారు.


