ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఢిల్లీ మహిళా కమిషన్ లోని 223 మంది ఉద్యోగులపై వేటు వేశారు. వీరంతా అక్రమంగా నియమితులయ్యారనే సాకుతో తక్షణం ఉద్యోగాలనుంచి తొలగించారు. నిబంధ నలకు విరుద్ధంగా ప్రభుత్వ అనుమతి లేకుండా అప్పటి ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ వీరిని కాంట్రాక్టు పద్ధతిలో నియమించారని మహిళా శిశు సంక్షేమ శాఖ తెలిపింది. వీరి నియా మకాలు సక్రమంగా జరగలేదని, లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి కూడా తీసుకోలేదని ఉత్తర్వులో పేర్కొ న్నారు. ఢిల్లీ మహిళాకమిషన్ ఎలాంటి అనుమతులు లేకుండా మార్గదర్శకాలను ఉల్లంఘించి, సిబ్బంది జీతాలు, అలవెన్స్ లను పెంచిందని కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఢిల్లీ మహిళా కమిషన్లోని 223 మందిపై వేటు
0
198
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


