వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరొకరు మరణించడంతో.. మృతుల సంఖ్య 9కి చేరుకుంది. ప్రమాదంలో గాయపడిన పైడి రాజు అనే కార్మికుడు సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ప్రమాదం జరిగిన తర్వాత పైడి రాజు తన కుటుంబ సభ్యుల కోసం తీసిన వీడియో కంటతడి పెట్టిస్తోంది. వర్మ తమ్ముడిపై కోప్పడకు, తమ్ముడిని బాగా చదివించు. నువ్వు కూడా బాగా చదువుకో. అమ్మని బాగా చూసుకోండి. డాడీ.. ఇక ఉంటాను. అంటూ రాజు చెబుతున్న మాటలు వింటుంటే మనసున్న ఎవ్వరికైనా ఏడుపు రాక మానదు. పైడి రాజు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అది చూసిన ప్రతి ఒక్కరూ చలించిపోతున్నారు. చావు బతుకుల్లోనూ భర్త తన భార్య కోసం, తన పిల్లల కోసం పడిన ఆరాటం చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
మరో కార్మికుడి కన్నుమూత.. అమ్మని బాగా చూసుకో… వీడియో వైరల్
0
8
Previous article
Latest Articles
కాంగ్రెస్ కోవర్ట్ను పట్టుకోకుండా మీడియాలో బీజేపీపై అరుపులు ఎందుకు?- బీఎల్ సంతోష్
మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నిక పొలిటికల్ థ్రిల్లర్గా మారింది. తెలంగాణలో పెండింగ్లో ఉన్న కోర్టు కేసును వెల్లడించలేదన్న ఆరోపణలతో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి అరవింద్ శర్మ తిరస్కరించారు....
- Advertisement -
- Advertisement -


