40.2 C
Hyderabad
Sunday, April 28, 2024
spot_img

ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాలని రాహుల్ గాంధీకి నోటీసులు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే ఎంపీగా రాహుల్ పై అనర్హత వేటు పడగా.. తాజాగా కేంద్రం మరో షాక్ ఇచ్చింది. ఏప్రిల్ 22లోగా ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని లోక్ సభ హౌసింగ్ ప్యానెల్ నోటీసులు జారీచేసింది. ఎంపీగా అనర్హత వేటు పడడంతో ప్రభుత్వ బంగ్లాలో ఉండే అర్హత లేదని తెలిపింది. అలాగే ఎంపీగా రాహుల్ కు వచ్చే వేతనం, అలవెన్స్ లు కూడా నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. కాగా 2019 ఎన్నికల ప్రచారం సమయంలో దొంగల ఇంటి పేరు మోదీనే ఎందుకుంటోంది అని రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ రాహుల్ పై పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారణ చేపట్టిన సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధించింది. దీంతో నిబంధనల ప్రకారం రాహుల్ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు పడింది.

Latest Articles

లోక్ సభ ఎన్నికల్లో బీ టీమ్ డైలాగ్ వార్

    తెలంగాణ పార్లమెంట్‌ పోరులో బీ టీమ్‌ మంటలు ఎగిసిపడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మొదలైన బీ టీమ్‌ డైలాగ్‌ వార్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ కొనసాగుతోంది. బీజేపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల మధ్య మాటల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్