31.2 C
Hyderabad
Thursday, April 17, 2025
spot_img

ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాలని రాహుల్ గాంధీకి నోటీసులు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే ఎంపీగా రాహుల్ పై అనర్హత వేటు పడగా.. తాజాగా కేంద్రం మరో షాక్ ఇచ్చింది. ఏప్రిల్ 22లోగా ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని లోక్ సభ హౌసింగ్ ప్యానెల్ నోటీసులు జారీచేసింది. ఎంపీగా అనర్హత వేటు పడడంతో ప్రభుత్వ బంగ్లాలో ఉండే అర్హత లేదని తెలిపింది. అలాగే ఎంపీగా రాహుల్ కు వచ్చే వేతనం, అలవెన్స్ లు కూడా నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. కాగా 2019 ఎన్నికల ప్రచారం సమయంలో దొంగల ఇంటి పేరు మోదీనే ఎందుకుంటోంది అని రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ రాహుల్ పై పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారణ చేపట్టిన సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధించింది. దీంతో నిబంధనల ప్రకారం రాహుల్ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు పడింది.

Latest Articles

‘మధురం’ మధురమైన విజయాన్ని అందుకోవాలి: వీవీ వినాయక్

యంగ్ హీరో ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్ జంటగా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచి గల నిర్మాత యం.బంగార్రాజు నిర్మించిన చిత్రం మధురం....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్