తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో దొంగలు రెచ్చిపోయారు. లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో హుండీని పగులగొట్టిన దుండగులు నగదును ఎత్తుకెళ్లారు. తెల్లవారుజామున దుండగులు అనుమానంగా సంచరిస్తుండడంతో స్థానికులు పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. నిందితుల వద్ద నుంచి 31వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. వీరిపై సుమారు 10కేసులు ఉన్నాయని.. ప్రత్యేకంగా ఆలయాల్లో హుండీలను మాత్రమే దొంగలిస్తారని దర్యాప్తులో తేలినట్లు ఆయన చెప్పారు. సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు ఆధారంగా ఇంకా ఎవరైనా నిందితులు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో రెచ్చిపోయిన దొంగలు
0
232
Previous article
Next article
Latest Articles
కోవిడ్ను మించిన వైరస్… లాక్డౌన్ తప్పదా?
మరో మహమ్మారి పంజా విసరబోతుందా...? లక్షల సంఖ్యల్లో ప్రజలు వైరస్ బారిన పడబోతున్నారా? మళ్లీ లాక్డౌన్ పరిస్థితులు రాబోతున్నాయా? నిత్యావసరాల కోసం కొట్టుమిట్టాడే పరిస్థితి దాపురించబోతుందా? ఆస్పత్రుల్లో బెడ్స్ కోసం ఆస్తులమ్ముకోవాల్సిన పరిస్థితి...
- Advertisement -
- Advertisement -


