అనంతపురం జిల్లా పోలీసులు మరోసారి భారీగా సెల్ ఫోన్లను రికవరీ చేశారు. ఎవరైనా సెల్ ఫోన్లు పోగొట్టున్నా.. లేదా చోరీకి గురైనా ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు లేకుండా వాట్సాప్ ఫిర్యాదుతో జిల్లా పోలీసులు ఫోన్లు రికవరీ చేస్తున్నారు. చాట్ బాట్ పేరుతో ఈ సేవలను పోలీసులు అందిస్తున్నారు. తాజాగా 53 లక్షల రూపాయల విలువైన 266 సెల్ ఫోన్లను ఈసారి రికవరీ చేశారు. ఇందులో మిస్ అయినవి 221 కాగా.. చోరీ అయినవి 45 మొబైల్ ఫోన్లు ఉన్నాయి. ఇప్పటి వరకు చాట్ బాట్ సేవల ద్వారా 15 కోట్ల 04 లక్షల విలువైన 8 వేల 886 ఫోన్లు రికవరీ చేసినట్టు ఎస్పీ మురళీకృష్ణ వెల్లడించారు. వీటిలో అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు, కర్నూలు, విశాఖ జిల్లాలు, కర్ణాటక, తెలంగాణ నుండి సెల్ ఫోన్ రికవరీ చేశారు.
భారీగా సెల్ఫోన్లు రికవరీ చేసిన అనంతపురం జిల్లా పోలీసులు
0
339
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


