ఇసుక అక్రమ రవాణాపై అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ వార్నింగ్ ఇచ్చారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉండటం, పైనుంచి ఆదేశాలు రావడంతో తాడిపత్రి సమీప పెన్నానదిలోని ఇసుక రేవును అధికారులు మూసివేశారు. అయితే, ఇసుకరేపు ఉన్న చోట సీసీ కెమెరాలు లేకపోవడంతో ఇంతకాలం అక్రమంగా ఇసుక రవాణా అవుతోందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో కలెక్టర్ వినోద్ కుమార్ తాడి పత్రి ఇసుక రేవులను పరిశీలించారు. ఇసుక అక్రమంగా రవాణా అవుతుండటంతో సంబంధిత అధికారు లపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇసుక అక్రమ రవాణా కాకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.