ఇటీవల వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను షర్మిల వెంట నడుస్తానని స్పష్టం చేశారు. షర్మిల ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంటే ఉంటానని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై సంచలన కామెంట్స్ చేశారు. వైసీపీకి సిద్ధాంతాలు ఉండాలని సూచించారు. అంతేకాదు మంగళగిరి ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారని అన్నారు. 1200 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి.. 120 కోట్లే కేటాయించారని ఆరోపించారు. మంగళగిరి అభివృద్ధి నిధులు విడుదల కాలేదన్న ఆర్కే.. 8 కోట్ల వరకు అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు ఇచ్చానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోంత డబ్బుతో అభివృద్ధి పనులు చేశానని చెప్పారు.
లోకేశ్ను ఓడించిన తనకు అధిష్టానం సహకారం అందించకపోతే ఎలా? .. అని ప్రశ్నించారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. రాజీనామా ఆమోదించకపోవడం అనేది వాళ్ల ఇష్టమని చెప్పారు. తాను స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా ఇచ్చానన్న ఆర్కే.. తన వ్యాఖ్యలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని కోరారు.
చంద్రబాబుపై వేసిన కేసులపై న్యాయ పోరాటం చేస్తాననిఆళ్ల రామకృష్ణారెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఇన్నర్ రింగ్రోడ్డు కేసులో కూడా కేసును వెనక్కి తీసుకోననని అన్నారు. షర్మిల కాంగ్రెస్లోకి వచ్చినా తన పోరాటం ఆగదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం తప్పు చేస్తే కేసులు వేసేందుకు కూడా వెనకాడనని ఈ సందర్బంగా ఆర్కే సంచలన వ్యాఖ్యలు చేశారు.