రాష్ట్రంలో కాపు సంక్షేమ సేన కమిటీలన్నీ తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య ప్రకటించారు. పాలకొల్లులో సమావేశమైన కాపు సేన కమిటీ సభ్యులంతా కమిటీ కొనసాగింపు లేదా రద్దు విషయమై పూర్తి అధికారాలు జోగయ్యకు ఇస్తూ తీర్మానం చేశారు. దీంతో వ్యవస్థాపక అధ్యక్షుడైన జోగయ్య మినహా వివిధ హోదాల్లో పనిచేస్తున్న అందరి పదవులు, అన్ని కమిటీలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి ఎన్నికల అనంతరం కమిటీ పునరుద్ధరణపై నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించారు. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి రద్దు చేసి కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు తనతో పాటు కొందరు కాపు నాయకులు నష్టపోయారని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని కాంక్షించారు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్తో పాటు బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎవరైనా ముఖ్యమంత్రి పదవి చేపట్టాలన్న జోగయ్య… తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని పేర్కొన్నారు.
ఏపీలో కాపు సంక్షేమ సేన కమిటీలన్నీ రద్దు
0
525
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


