16.7 C
Hyderabad
Monday, January 19, 2026
spot_img

ఏపీలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

    తిరుపతి జిల్లాలో కౌంటింగ్‌ ఏర్పాట్లకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. చంద్రగిరి అభ్యర్థులకు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా రాజకీయ పార్టీల నేతలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. 2వేల 231 మంది సిబ్బందితో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందన్నారు. చిత్తూరు జిల్లాలో ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. ఎస్వీ ఇంజనీ రింగ్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేశారు. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపుకు 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 17రౌండ్లలో చిత్తూరు, నగిరి నియోజకవర్గాల ఫలితాలు, 18 రౌండ్‌లో కుప్పం ఫలితాలు వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపులో 1,088 మంది సిబ్బంది పాల్గొననున్నారు.పల్నాడు జిల్లా లో ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. నరసరావుపేట JNTU కళాశాలలో కౌంటింగ్‌ జరగనుంది. ఉదయం 8గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌంటింగ్‌ విధుల్లో 700మంది సిబ్బంది పాల్గొననున్నారు. కౌంటింగ్ ప్రక్రియను కలెక్టర్‌ బాలాజీరావు, ఎస్పీ మాలిక గార్గ్‌ పర్యవేక్షించనున్నారు. JNTU పరిసరాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. జిల్లాలో మొదటగా చిలకలూరిపేట నుంచి, చివరగా గురజాల నుంచి ఫలితాలు వెలువడనున్నాయి. ఇతర జిల్లాల వ్యక్తులు కౌంటింగ్ ప్రదేశానికి రావద్దని ఎస్పీ మాలిక గార్గ్ ఆదేశాలు జారీ చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్