ట్రోల్ల్స్‌పై మొదటిసారి స్పందించిన ఆదిపురుష్ దర్శకుడు

స్వతంత్ర వెబ్ డెస్క్: రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన ‘ఆదిపురుష్’ సినిమా విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో భారీగా ట్రోల్ల్స్ కి గురవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సంభాషణల విషయంలో ఎన్నో ట్రోల్ల్స్ వచ్చిన వాటి గురించి డైలాగ్ రైటర్ మనోజ్ ముంతిషర్ స్పందిస్తూ వచ్చారు. అయితే సినిమా ఇన్ని ట్రోల్ల్స్ ఎదుర్కొంటున్న నేపథ్యంలో మొదటిసారిగా దర్శకుడు ఓం రౌత్ స్పందించారు. విమర్శల కంటే కూడా బాక్సాఫీసు వద్ద ఆదిపురుష్ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందన్నదే ముఖ్యమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తమ చిత్రం రాబడుతున్న వసూళ్లతో తాను చాలా సంతోషిస్తున్నానని తెలిపారు. రామాయణంలో నేను అర్థం చేసుకున్న అతి కొద్ది భాగాన్ని, మీకు తెలిసిన అతి కొద్ది భాగాన్ని మాత్రమే నేను సినిమా తీశాను. ఇది ఉడత సాయం కిందికే వస్తుంది. నేను బాల్యంలో టీవీలో చూసిన రామాయణం చాలా పెద్దది. కానీ నేను రామాయణంలోని కొంత భాగాన్ని మాత్రమే సినిమాగా తీశాను, కేవలం యుద్ధకాండనే సబ్జెక్టుగా తీసుకున్నాను” అని ఓం రౌత్ వివరించారు.

Latest Articles

ఎన్నిసార్లు దొరికిపోయినా కుట్ర, క్షుద్ర రాజకీయాలు మానరా?- లోకేశ్

మాజీ సీఎం జగన్‌పై ఎక్స్‌లో మంత్రి నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జగన్ తన 'గొడ్డలి పార్టీ' కార్యకర్తలను రంగంలోకి దింపారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్