ధర్మవరంలో ‘మా నమ్మకం నువ్వే జగన్’ కార్యక్రమం చేపడుతున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి(Kethireddy Venkatarami Reddy)కి వింత అనుభవం ఎదురైంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఓ ఇంటికి వెళ్లి సీఎం జగన్ పాలన ఎలా ఉంది అని అడిగారు. దీంతో అక్కడున్న మహిళ ‘మద్యం ధరలు తగ్గించండి సార్’ అంటూ కోరింది. ‘నీ భర్త తాగకుండా ఉండేందుకే కదా ధరలు పెంచింది’ అని కేతిరెడ్డి సమాధానమివ్వగా.. ‘తాగకుండా ఉంటే మంచిదే సార్.. ధరలు కూడా తగ్గించాలి’ అని తెలిపింది. ‘తాగి వస్తే నీ భర్తకు అన్నం పెట్టొద్దు అనగా.. పనిచేసి వచ్చే వాడికి అన్నం పెట్టకపోతే ఎలా సార్’ అంటూ సమాధానమిచ్చింది. ‘ఆడపిల్లలున్న దాన్ని సార్.. వారిని చదివించుకోవాలి.. మద్యం ధరలు తగ్గించండి’ అంటూ విజ్ఞప్తి చేసింది. కేతిరెడ్డి, మహిళ మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మద్యం ధరలు తగ్గించండి సార్.. కేతిరెడ్డికి మహిళ విజ్ఞప్తి
0
289
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


